వారణాసి కోసం.సంపూర్ణ సమాచారం - Vishwagurunidhi

కాశిలో ..చేయవలసినవి..చూడవలసినవి..


కాశీ లో ప్రవేశించగానే ముందుగా..
కాశీ విశ్వేశ్వరుని తలచుకుని, నమస్కరించుకుని
కాశీ నేలని తాకి నమస్కరించుకోవాలి.

బస చేరుకున్న తరువాత ముందుగా..
గంగా దర్శనం..గంగా స్నానం.
కాలభైరవుని దర్శనం
కాలభైరవుని గుడి వెనకాల దండపాణి గుడి దర్శనం డుంఠి గణపతి దర్శనం

కాశీ విశ్వేశ్వరుని దర్శనం
(ప్రొద్దున 4-00amకి తిరిగి సాయంత్రం 7-30pmకి స్పర్శ దర్శనం ఉంటుంది.)
కాశీ [భక్తులు దర్శనానికి వచ్చే దాన్ని బట్టి ఇది మారుతుంటుంది

అన్నపూర్ణ దర్శనం 
భాస్కరాచార్య ప్రతిష్ఠిత శ్రీచక్ర లింగ దర్శనం (అన్నపూర్ణ దేవాలయ ప్రవేశ ద్వారం వద్ద కుడివైపు ఉంటుంది).

కాశీ విశాలాక్షి దర్శనం
వారాహి మాత గుడి
ఈ గుడి ప్రొద్దున 8-00 గంటల వరకే తెరిచి ఉంటుంది.  లలిత ఘాట్ వద్ద నుండి వెళ్ళవచ్చు. 
లేకపోతే విశాలాక్షి మాత గుడి వెనుకగా
వారాహి మాత గుడికి అడ్డ దారి ఉన్నది
ఇది చాలా దగ్గర దారి.  ఎవరిని అడిగినా చెపుతారు.

మణికర్ణికా ఘట్టంలో స్నానం.
(వీలైతే మధ్యాహ్నం 12-00 గంటలకి)
గంగా హారతి -
దశాశ్వమేధ్ ఘాట్ వద్ద (అస్సి ఘాట్ వద్ద కూడా గంగా హారతి ఇస్తారు)
కేదార్ఘాట్ వద్ద కేదారేశ్వరుని దర్శనం
చింతామణి గణపతి దర్శనం
అస్సి ఘాట్ వద్ద ఉన్న లోలార్క కుండం లో స్నానం లేక ప్రోక్షణ 
లోలార్కఈశ్వరుని దర్శనం
దుర్గా మందిరము 
గవ్వలమ్మ గుడి 
తులసీ మానస మందిరము
సంకట మోచన హనుమాన్ మందిరం.
తులసీ దాసుకు ఆంజనేయ స్వామి దర్శనం అయిన స్థలం.
తిలాభాండేశ్వర దర్శనం

వీలైతే సారనాధ్ స్థూపం  బుద్ధ మందిరం -
ఇది కొంత దూరంగా ఉంటుంది.
ప్రత్యేకంగా వెళ్ళాలి. ఇది బట్టల షాపింగ్ సెంటర్.

గంగా నదీ ఘట్టాల దర్శనం -
అస్సి ఘాట్ నుండి మొదలు పెడితే వరుణ నాదీ సంగమం వద్ద ఉన్న ఆదికేశవ్ మందిరం దాకా వెళ్ళవచ్చు.

ఆదికేశవ స్వామి దర్శనం చేసుకోవాలి. 
ఇదే విష్ణు మూర్తి ప్రథమంగా భూమి పై అవతరించిన చోటు. 
గుడిలోకి వెళ్లి వస్తామని బోటు అతనితో ముందే మాట్లాడుకోవాలి.
లేకపోతె నదిలో నుంచే చూపించి వెనక్కి తిప్పుతారు.

బిందు మాధవుని గుడి -
ఇది పంచగంగ ఘాట్ వద్ద ఉన్న ఔరంగజేబు కోటకి దగ్గరలో ఉంటుంది.

ఓంకాళేశ్వర దర్శనం - 
మెయిన్ రోడ్ నుండి కాల భైరవ స్వామి గుడి వైపు కాకుండా Left side రోడ్ లో వెళ్ళాలి.
రిక్షా అయితే మంచిది. 
ఇవి రెండు మందిరాలు, ఉకారేశ్వరుడు  మకారేశ్వరుడు  చిన్నగా ఉంటాయి
కానీ ఇవి రెండూ కూడా స్వయంభూ లింగాలు.

కృత్తివాసేశ్వర లింగం -
ఓంకాళేశ్వర స్వామి దర్శనం అయిన తరువాత ఇంకా కొంచం ముందుకు వెళ్ళితే కృత్తివాసేశ్వర లింగం వస్తుంది. ఇది అన్ని కాలలలోను చల్లగా ఉంటుంది. 
స్వయంభూ లింగం.
కృత్తివాసేశ్వర లింగం దర్శనం అయినా తరువాత
ఇంకా కొంచం ముందుకు వెళ్ళితే
మహా మృత్యుంజయలింగం దర్షించుకోవాలి.

బనారస్ హిందూ విశ్వవిద్యాలయం + అక్కడి నూతన విశ్వనాథ, దుర్గా  లక్ష్మి నారాయణ గుడి సముదాయం

వారాణసిలో ఉన్న కొన్ని ముఖ్యమైన శివ లింగాల..
స్థలాలు..💐
విశ్వేశ్వరుడు - గంగానది ఒడ్డున దశాశ్వమేధ ఘాట్ వద్ద
మంగళేశ్వరుడు - శంక్తా ఘాట్
ఆత్మ విశ్వేశ్వరుడు - శంక్తా ఘాట్
కుక్కుటేశ్వరుడు - దుర్గా కుండ్
త్రి పరమేశ్వరుడు - దుర్గా కుండ్
కాల మాధవుడు - కథ్ కీ హవేలీ
ప్రయాగేశ్వరుడు - దశాశ్వమేధ ఘాట్
అంగారకేశ్వరుడు - గణేష్ ఘాట్
ఆంగనేశ్వరుడు - గణేష్ ఘాట్
ఉపస్థానేశ్వరుడు - గణేష్ ఘాట్
పరమేశ్వరుడు - శంక్తా ఘాట్
హరిశ్చంద్రేశ్వరుడు - శంక్తా జీ
వశిష్టేశ్వరుడు - శంక్తా జీ
కేదారేశ్వరుడు - కేదార్ ఘాట్
నీల కంఠేశ్వరుడు - నీల కంఠా
ఓంకారేశ్వరుడు - చిట్టన్ పురా
కాశేశ్వరుడు - త్రిలోచన్
శ్రీ మహా మృత్యుంజయుడు - మైదాగిన్
శుక్రేశ్వరుడు - కాళికా గలీ

వారాణసి నగరాన్ని ఇతిహాస పురాణాలలో
అవిముక్తక..
ఆనందకానన..
మహాస్మశాన..
సురధాన..
బ్రహ్మవర్ధ..
సుదర్శన..
రమ్య..
కాశి..అనే వివిధ నామాలతో ప్రస్తావించారు.

ఋగ్వేదంలో ఈ నగరాన్ని "కాశి", "జ్యోతి స్థానం" అని ప్రస్తావించారు.

స్కాంద పురాణంలోని కాశీఖండంలో ఈ నగర మహాత్మ్యం గురించిన వర్ణన ఉంది.
ఒక శ్లోకంలో శివుడు ఇలా అన్నాడు
ముల్లోకాలు నాకు నివాసమే.
అందులో కాశీ క్షేత్రం నా మందిరం

గంగా హారతి. గంగామాతకు నదీతీరక్షేత్రాలలో నిర్వహించే ఈ హారతి పవిత్ర కాశీలో కూడా ఘనంగా ప్రతిరోజూ నిర్వహిస్తుంటారు.
ఈ హారతి దృశ్యాలను  ప్రతిరోజూ వేలాది మంది తిలకిస్తుంటారు.
వీరిలో విదేశీయులు అధికంగా ఉండడం ఒక ప్రత్యేకత. ఈ హారతులను దశాశ్వమేధ్ ఘాటులో నిర్వహిస్తారు కనుక యాత్రీకులు దశాశ్వమేధ ఘాటుకు చేరుకోవడం అవసరం.

అయోధ్య,
మథుర,
గయ,
కాశి,
అవంతిక,
కంచి,
ద్వారక
నగరాలను సప్తముక్తి పురాలని హిందువుల విశ్వాసం

"కాశి,
కాంచి,
మాయ,
ఆయోధ్య,
ఆవంతిక,
మథుర మరియు
ద్వారవతి" లు
సప్త మోక్షపురులు గా పేర్కొనబడ్డాయి.

కాశి, ఆయోధ్య మరియు మథుర మోక్ష క్షేత్రాలు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లో ఉన్నాయి.

ద్వారవతి (ద్వారక) మోక్షపురి గుజరాత్ రాష్ట్రం లో ఉంది.

మాయ (హరిద్వార్) మోక్షపురి ఉత్తరాఖండ్ లేక ఉత్తరాంచల్ రాష్ట్రం లో ఉంది.


●◆■వారణాసి(కాశి)■◆●

    కాశి వైభవాన్ని పూర్తిగా తెలపడం దేవతలకు కూడా సాధ్యం కాదు సముద్రం నుండి నీటి బిందువు లాంటి సంక్షిప్త సమాచారం
      కాశి పట్టణం గొడుగు లాంటి పచ క్రోశాల పరిధి లో ఏర్పడ్డ బుభాగం ఇది లింగం లాంటి పరమేశ్వర స్వరూపం కలిగి ధనుస్సాకారం లో ఉంటుంది కాశి బ్రమ్మ దేవుని సృష్టి లోనిది కాదు విష్ణు మూర్తి హృదయం నుండి వెలువడి సృష్టి ఆరంభంలో శువుడు నిర్మించుకున్న ప్రత్యేక స్థలం ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధాని ప్రపంచ సాంస్కృతిక నగరం
స్వయంగా శివుడు నివాసముండె నగరం

ప్రళయ కాలంలో మునుగని అతి  ప్రాచిన పట్టణం శివుడు ప్రళయ కాలంలో తన తన త్రిశూలం తో కాశిని పైకెత్తి కాపాడతాడు.

కాశి భువి పైన సప్త మోక్ష ద్వారాలలో ఒకటి, కాశి పన్నెందు జోతిర్లింగాలలో కెల్లా శ్రేష్ఠమైనది పద్నాలుగు భువన బాండాలలో విశేషమైన స్థలం.

కాశీలో గంగా స్నానం,బిందు మాధవ దర్శనం, అనంతరం మొదట డిండి వినాయకుడు, విశ్వనాథుడు,విశాలాక్షి, కాలభైరవ దర్శనము అతి ముఖ్యం

ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప క్షేత్ర పాలకుడు బైరవుడు జీవిని  కాశి లోనికి అనుమతించడు
కాశి లో మరణించిన వారికీ యమ బాధ పునర్ జన్మ ఉండదు

కాశి ప్రవేశించిన జివి యొక్క చిట్టా చిత్రాగుప్తుని నుండి మాయం అయి కాలభైరవుని వద్దకు చేరుతుంది డిండి గణపతి కాల బైరవుడు పరిశీలించి యమ యాతన కంటే 32 రేట్లు అధిక శిక్షసులు విధించి మరు జన్మ లేకుండా చేస్తాడు కాబట్టే కాశీలో  కాల భైరవ దర్శనం తరవాత పూజారులు విపు పై కర్రతో కొట్టి దర్శించిన వారు కాశి దాటి వెళ్లి పోయినా పాపలు అంటకుండా రక్ష నల్లని కాశి దారం కడతారు

కాశి వాసం చేసే వారికి సమస్త యాగాలు తపస్సులు చేసిన పుణ్యం తో పాటు అన్ని చక్రాలు ఉత్తేజితమైతాయి

కాశీలో మరణించిన ప్రతి జివికి శివుడు దర్శనమిచ్చి వారి కుడి చెవిలో తారక మంత్రం పలికి మోక్షం ప్రసాదిస్తాడు
అందుకే కాశ్యాన్తు మరణాన్ ముక్తి అని శాస్త్ర వచనం కాబట్టే చివరి జీవితం చాలా మంది కాశీపూరిలో గడుపుతారు.

మరణించిన వారి ఆస్తికలు కాశి గంగలో కలిపితే గతించిన వారు మల్లి కాశీలో జన్మించి స్వయంగా  విశ్వనాథునిచే ఉద్దరింప బడతారు.

గోముకం నుండి బయలుదేరే గంగమ్మ విచిత్రంగా దారి మల్లి దక్షిణ దిశగా ప్రవహించి దన్నుసాకారపు కాశి పట్టన్నాని చుట్టి తిరిగి తన దారిలో ప్రవహిస్తుంది ఎంత కరువు వచ్చినా గంగమ్మ కాశి ఘాట్లను వదిలి దూరం జరగలేదు.

శివుని కాశిలోని కొన్ని వింతలు
కాశీలో గ్రదలు ఎగరవు, గోవులు పొడవవు, బల్లులు అరవవు, శవాలు వాసన పట్టవు, కాశీలో మరణించిన ప్రతి జివి కుడి చెవి పైకి లేచి ఉంటుంది.

కాశీలో మందిరం చుట్టూ అనేక చిన్న తొవ సంధులు కలిగి అట్టి సంధులు అనెక వాలయకారాల్లో చుట్టినట్టు ఉండి ఒక పద్మవ్యూహం లాగా కొత్త వారికీ గూడి జాడ దొరకకుండా ఉంటుంది
కానీ పూర్వం ఇక్కడ అనేక సుందర వానలు పులచెట్లు మధ్య ఉన్న మందిరాన్ని విదేశీ దండ యాత్రికుల దాడుల నుండి కాపాడుకోవడానికి ప్రజలంతా గుడి చుట్టూ పెద్ద పెద్ద బంగలాలు కట్టి శత్రు సైనికులకు దారి లేకుండా చేసినారు.

అనేక దేశాల నుండి పెద్ద పెద్ద శాస్త్ర వేత్తలు వచ్చి కాశి లో అనేక రీసెర్చ్ లు జరిపి ఆశ్చర్య పోయ్యారు అస్సలు ఇ కాస్మోర్స్ ఎక్కడి నిండి వస్తున్నాయి 
అప్పటి పూర్వికులు శక్తి చలనం వున్న చోటల్లా మందిరాలు నిర్మించారు అంత పరిజ్ఞ్యానం ఆ రోజుల్లో వారికీ ఎక్కడిది అని ఆశ్చర్యానికి గురైనారు.

కాశి విషవేశ్వరునికి శవ భస్మ లేపనం తో పూజ ప్రారంభిస్తారు

కాశిలోని పరాన్న బుక్తేశ్వరుణ్ణి దర్శిస్తే జీవికి పరుల అన్నం తిన్న ఋణం నుండి ముక్తి లబిస్తుంది

కాశి క్షేత్రంలో పుణ్యం చేస్తే కోటి రేట్లు ఫలితం ఉంటుంది, పాపం చేసినా కోటి రేట్ల పాపం అంటుతుంది.

విశ్వనాథుణ్ణి అభిషేకించిన తరవాత చేతి రేఖలు మారిపోతాయి
ఇక్కడి శక్తి పీఠం విశాలాక్షి అమ్మవారు
జగత్అంతటికీ అన్నం పెట్టే అన్నపూర్ణ దేవి నివాస స్థలం కాశి

ప్రపంచంలోని అన్ని భాషలకు తల్లి అయిన అతి ప్రాచీన సంస్కృత పీఠం కాశిలోనే వున్నది

కాశీలో గంగమ్మ తీరాన 84 ఘాట్లు వున్నాయి ఇందులో దేవతలు,ఋషులు,రాజులూ, తో పాటు ఎందరో తమ తపశక్తితో నిర్మించిన వి ఎన్నో వున్నాయి
అందులో కొన్ని
1, దశాశ్వమేధఘాట్ బ్రమ్మ దేవుడు 10 సార్లు అశ్వమేధ యాగం చేసినది ఇక్కడే రోజు సాయకాలం విశేషమైన గంగామా హారతి జరుగుతున్నది
2,ప్రయాగ్ ఘాట్ ఇక్కడ భూగర్భంలో గంగతో యమునా,సరస్వతిలు కలుస్తాయి
3, సోమేశ్వర్ ఘాట్ చంద్రుడు చేత నిర్మితమైనది
4,మీర్ ఘాట్ సతి దేవీ కన్ను పడిన స్థలం విశాలాక్షి దేవి శక్తి పీఠం.
ఇక్కడే యముడు ప్రతిష్టించిన లింగం ఉంటుంది
5,నేపాలీ ఘాట్ పశుపతి నాథ్ మందిరం బంగారు కళశంతో నేపాల్ రాజులూ కట్టినాడు
6, మని కర్ణికా ఘాట్ ఇది కాశీలో మొట్ట మొదటిది దీనిని విష్ణు దేవుడు స్వయంగా సుదర్శన చక్రం తో  తవ్వి నిర్మించాడు ఇక్కడ సకల దేవతలు స్నానమ్ చేస్తారు ఇక్కడ గంగ నిర్మలంగా పారుతుంది ఇక్కడ మధ్యాహ్నం సమయంలో ఎవరైనా సుచేల స్నానం చేస్తే వారికి జన్మ జన్మల పాపలు తొలిగి పోతాయి జీవికి ఎంత పుణ్యం ప్రాప్తిస్తుందో చతుర్ ముఖ బ్రహ్మ దేవుడు కూడా వర్ణించలేడట

Comments