siddheswarananda bharati swamy - Vishwagurunidhi

siddheswarananda bharati swamy - Vishwagurunidhi


పరమయోగుల పవిత్ర భూమి...
పుణ్యతీర్థం :: కుర్తాళం పీఠం**

పరమ యోగులెందరో నడయాడిన పవిత్ర ప్రాంతం.. దక్షిణ భారతావని. తెలుగు, తమిళ సీమల్లో ఒక్కో ప్రాంతం, ఒక్కో క్షేత్రం, ఒక్కో తీర్థానికి ఒక్కొక్క ప్రత్యేకత. తమిళనాట తిరునల్వేలి జిల్లాలో దక్షిణ కాశి (తెన్‌ కాశి)కి 3 మైళ్ళ దూరంలో చిత్రానదీ తీరంలోని కుర్తాళం అలాంటి ప్రత్యేకతలెన్నో ఉన్న పవిత్రభూమి. స్థలం (త్రికూటాచలం), తీర్థం (చిత్రా నది), దైవం (త్రికూటాచలపతి) – ఈ మూడు విశేషాలూ ఒకే చోట ఉండడం వల్ల ఈ ప్రాంతం ‘త్రికూటాచల క్షేత్రం’గా ప్రసిద్ధి. ‘త్రికూటా చలం’ అన్నమాట వ్యవహారంలో ‘తిరు కుర్తాళం’, ఇప్పుడు ‘కుర్తాళం’ అయి ఉంటుందని అంచనా. (సంస్కృత గ్రంథాల్లో కుద్దాలం అన్నారు).  కుర్తాళం అనగానే ఆహ్లాదం పంచే జలపాతాలు, ప్రకృతి సోయగం నిండిన పర్యాటక ప్రాంతం గుర్తుకొస్తాయి. అక్కడే సరిగ్గా నూరేళ్ళ క్రితం భక్తి, ముక్తి, యోగ సాధనలకు కేంద్రంగా మహిమాన్వితమైన ఒక పీఠం ఏర్పడింది. ఆ పీఠం మన తెలుగు స్వామి ఒకరు ఏర్పాటుచేసిందవడం విశేషం. అదే – శ్రీసిద్ధేశ్వరీ పీఠం... మౌనస్వామి ఆశ్రమం... కుర్తాళం పీఠం.. ఇలా భక్తులు రకరకాల పేర్లతో పిలుచుకొనే పవిత్రమైన ప్రాంగణం.

కుర్తాళం ప్రాచీనకాలం నుంచి ‘అగస్త్య క్షేత్రం’గా ప్రసిద్ధం. అపరిమితంగా ఎత్తు పెంచేస్తున్న వింధ్య పర్వతాన్ని నియంత్రించేందుకు వింధ్యకు అటువైపు ఉన్న ఉత్తరాది నుంచి ఇటు వైపు ఉన్న దక్షిణాదికి వచ్చిన అగస్త్య మహర్షి, తన భార్య లోపాముద్రతో సహా ఈ కుర్తాళం ప్రాంతంలోనే శాశ్వతంగా వసించి, జపతపాలు ఆచరించారట. దక్షిణాదికి వచ్చినప్పుడు విశ్వామిత్రుడు కూడా ఇక్కడ తపస్సు చేశా డంటారు. త్రికూటాచలం అంటే – మూడు కూటముల (శిఖరాల)తో కూడిన అచలం (కొండ). ఇక్కడి కొండ కూడా పడమటి కనుమల్లో మామూలుగా కనిపించే కొండల వరుసలా కాక, 3 శిఖరాలతో దాదాపు ఒక వలయాకారంగా అనిపిస్తుంది. ఆ రకంగా దీన్ని ‘త్రికూటా చలం’ అన్నారు. ఈ క్షేత్రంలోని పురాతన ఆలయంలో దేవుడి పేరు – త్రికూటాచలపతి. ఆయన్నే ‘కుర్తాళనాథుడు’ అనీ పిలుస్తారు. దక్షిణ పాండ్య దేశంలోని 14 ప్రధాన శివ క్షేత్రాల్లో ఈ ‘కుర్తాళం’ ప్రసిద్ధమైనది.

గృహస్థాశ్రమం నుంచి యోగిగా....
అలాంటి చోట ఏర్పాటైన పీఠం – కుర్తాళం పీఠం. గడచిన ఆశ్వయుజ మాసంలో శత వసంతాలు పూర్తి చేసుకున్న ఈ తెలుగు వారి పీఠానిది ఘన చరిత్ర. వందేళ్ళ క్రితం 1916లో శ్రీశివచిదానంద సరస్వతీస్వామి నెలకొల్పిన పీఠమిది. కాశ్మీరం నుంచి కన్యాకుమారి దాకా దేశమంతా పర్యటించి, ఎంతోమంది సాధువులు, సన్న్యాసుల నుంచి విజ్ఞానం అందుకొని, అనంతరం మౌనాన్ని ఆశ్రయించిన ఆయన ‘మౌనస్వామి’గా ప్రసిద్ధికెక్కారు. ఆయన అచ్చ తెలుగువారు. దేవీ ఉపాసకులైన ఆయన, మహనీయుడైన ఒక సాధువును కలవడంతో పారమార్థికం వైపు మళ్ళారు. 1906 ప్రాంతంలో ఒక అర్ధరాత్రి వేళ భార్యాబిడ్డల్ని విడిచిపెట్టి వెళ్ళిన ఆయన మళ్ళీ ఇంటి ముఖం చూడలేదు. ఉత్తరాదిన పుణ్యక్షేత్రాలు తిరుగుతూ, సన్న్యాస దీక్షతో శివచిదానంద సరస్వతి అయ్యారు. ఆ తరువాత అపర దత్తాత్రేయ అవతారమైన వాసుదేవానంద సరస్వతీ స్వామిని దర్శించి, యోగవిద్య అభ్యసించారు. ఎన్నో సిద్ధులు పొందారు. 

ఇంద్రుడు పంపిన పీఠం... స్వామి పెట్టిన మఠం దేశంలో అనేక మఠాలున్నా కుర్తాళం మఠం ప్రత్యేకత వేరు. భూలోకంలో పూజ కోసం పూర్వం దేవేంద్రుడు నాలుగు పీఠాలను పంపాడట. వాటిలో ఒకటి – శృంగేరిలోని శారదా పీఠం. రెండోది – ఈ కుద్దాల (కుర్తాళ) క్షేత్రంలోని ధరణీ పీఠం. మూడోది – కంచిలోని కామకోటి పీఠం. నాలుగోది ఉత్తర భారతావనిలో నెలకొల్పినట్లు చెబుతారు. ఈ ప్రాశస్త్యాన్ని గుర్తించిన శృంగేరీ పీఠాధిపతి కుర్తాళంలో యతులకు కావాల్సిన మఠం నిర్మించాల్సిందిగా మౌనస్వామితో చెప్పారు. ఫలితమే కుర్తాళం మఠం.

ఆ విఘ్ణపతికి నాడి కొట్టుకొంటుంది! ఈ పీఠంలో రావి చెట్టు కింద సిద్ధి వినాయక విగ్రహాన్ని  మౌనస్వామి ప్రతిష్ఠించారు. హారతిచ్చే సమయంలో విగ్రహం కదులుతున్న అనుభూతి కల్గింది. విగ్రహానికి నాడి కొట్టుకుంటున్న ట్లనిపించింది. ఏదైనా కోరుకొని, గణపతిని ప్రార్థించి, గుడి గడప వద్ద కొబ్బరికాయ కొడితే, ఆ కోరిక తీరుతుంది.

ప్రత్యర్థులపై జయానికి... ప్రత్యంగిరా దేవి  క్షుద్రశక్తుల నుంచి, ప్రత్యర్థులు, శత్రువుల నుంచి కాపాడే దైవం – ప్రత్యంగిరాదేవి. ఎండు మిరపకాయలతో ప్రత్యంగిరా హోమం చేస్తే ప్రతికూల శక్తులు, దురదృష్టం దూరమవుతాయి. అమావాస్యకి ప్రత్యంగిరా హోమం, మంగళవారం మధ్యాహ్నం రాహుకాల పూజ చేస్తారు.

క్షేత్రపాలకుడు దండాయుధపాణి మౌనస్వామి ప్రతిష్ఠించిన దండాయుధపాణి (కుమారస్వామి) ఆలయమిక్కడ ప్రసిద్ధం. ఈ పీఠానికి క్షేత్ర పాలకుడు దండాయుధపాణే! కాళి, కాలభైరవ ఆలయాలూ ఉన్నాయి.

పర్యాటక ప్రాంతం... కుర్తాళం మంచి వేసవి విడిది – కుర్తాళం. పడమటి కనుమల్లో 160 మీటర్ల ఎత్తున నెలకొన్న పంచాయతీ ఇది. భౌగోళికంగా ఇది తమిళనాట ఉన్నా, కేరళ సరిహద్దులకు అతి దగ్గర! కుర్తాళంలో డజను జలపాతాలున్నాయి. ఈ జలపాతాల నీటికి మహత్తరమైన ఔషధీ విలువలున్నాయని నమ్మకం. మదురై, రామేశ్వరం, తిరుచెందూర్, త్రివేండ్రం, శబరిమల లాంటి భక్త


ఆ స్వామి ‘మౌనస్వామి’ ఎందుకయ్యారు?
హిమాలయాల్లో తపస్సాధనలతో ఎన్నో ఏళ్ళు గడిపిన ఆయన మౌన దీక్ష స్వీకరించడం చిత్రమైన గాథ. కాశ్మీర్‌లో పెద్ద పండిత సభ జరిగింది. అక్కడ వాదనలో చిత్రమైన ఒక ప్రశ్నకు మహా మహా పండితులు సైతం అందరూ అంగీకరించే జవాబివ్వలేకపోయారు. అక్కడే ఉన్న స్వామీజీ జవాబు చెప్పి, సమస్యను చిటికెలో పరిష్కరించారు. అయితే, ఇలా పాండిత్యాన్నీ, శక్తినీ ప్రదర్శిస్తే అహం పెరుగుతుందని స్వామి వారి గురువు గారు సూచించారు. ‘వివాదాల్లో పాల్గొనకుండా, మౌనవ్రతం ఆచరిస్తూ, యోగాన్ని అనుష్ఠించు’ అని శాసించారు. అంతే! వెంటనే స్వామి మౌన దీక్ష చేపట్టారు. అప్పటి నుంచి శేష జీవితమంతా మౌనం లోనే గడిపారు. ఆశ్రయించిన భక్తుల్ని ఆశీర్వదించి, మార్గదర్శనం చేశారు.

ఆశీర్వదించే అమ్మవారు... అయ్యవారు...
మౌనస్వామి దక్షిణాదిలో పర్యటిస్తూ, కుర్తాళంలో స్థిరపడ్డారు. అక్కడే త్రికూటాచలేశ్వరుడి ఆలయంలో ధరణీ పీఠానికి ఎదురుగా కూర్చొని, శిరస్సు నుంచి పాదాల దాకా కాషాయ వస్త్రం కప్పుకొని, రాత్రింబగళ్ళు యోగనిష్ఠలో ఉంటూ తపస్సు చేశారు. దైవప్రేరణ మేరకు 1914లో ఒక తోటలో దత్తాత్రేయ మందిరం నిర్మిం చారు. అటు పైన 1916 అక్టోబర్‌లో శ్రీసిద్ధేశ్వరీ దేవిని ప్రతిష్ఠించారు. అదే ఇప్పటికి వందేళ్ళుగా భక్తుల్ని ఆకర్షిస్తున్న పవిత్ర మౌనస్వామి మఠం. పచ్చటి ప్రకృతి మధ్య నెలకొన్న ఈ మఠంలో ప్రధాన దేవత శ్రీసిద్ధేశ్వరీదేవి (శ్రీరాజ రాజేశ్వరీ దేవి). దేవుడు – కామేశ్వరుడు. ఇక్కడకు వచ్చి, ఆ ఆదిదంపతులను ప్రార్థించి, ధ్యానించిన భక్తులకు ప్రశాంతత చేకూరు తుందనీ,అమ్మ ఆశీర్వదిస్తుందనీ నమ్మిక.

పీఠం ఏర్పాటైంది ఇలా!
అనేక మఠాలలో పీఠాలున్నట్లే, మన మఠంలోనూ పీఠం ఉండా లని భక్తులు కోరారు. పీఠమంటే శ్రీచక్రం. పీఠం మీద సాక్షాత్తూ పరాశక్తే ప్రతిష్ఠితురాలై ఉంటుంది. మౌనస్వామి రాజరాజేశ్వరీ దేవి సన్నిధానంలో శ్రీచక్రం స్థాపించారు. అలా పీఠం ఏర్పడింది. దానికి ‘శ్రీసిద్ధేశ్వరీ పీఠం’గా పేరు పెట్టారు. రాజరాజేశ్వరీ దేవి అలా శ్రీసిద్ధేశ్వరీ పీఠాధిష్ఠాన దేవత అయింది. కుర్తాళం తెలుగు వారి పీఠమైంది.

మహిమాన్విత మౌనస్వామి
షిర్డీ సాయిబాబా, రమణ మహర్షి, శేషాద్రిస్వామి సహా నిఖిలేశ్వరా నంద, విశుద్ధానంద, వాసుదేవానంద తదితర యోగులతో కుర్తాళం పీఠ వ్యవస్థాపకులైన మౌనస్వామికి అనుబంధం ఉండేది. శూన్యం నుంచి బంగారం, నవరత్నాలతో సహా సమస్తం సృష్టించే అష్ట మహా సిద్ధులు, భౌతికేతర లింగ శరీరంతో చేసే అతీంద్రియ యానం లాంటివి స్వామికి కరతలామలకం. ఒకసారి నవరాత్రులకు సంతర్పణలో పిండివంటలకు నెయ్యి దొరకనప్పుడు, కిరసనాయిల్‌ని కాచి, దాన్ని నెయ్యిగా మార్చారు. ఇక భక్తుల వ్యాధుల్ని తగ్గించి, కరుణించిన ఘట్టాలు కొల్లలు. ఏకకాలంలో మూడు చోట్ల దర్శనమిచ్చిన ఉదంతాలూ ఉన్నాయి. పీఠంలోని దండా యుధపాణి గుడిలో యోగసమాధి నిష్ఠలోనే ఆయన దేహత్యాగం చేశారు. ఇప్పటికీ పీఠంలో మౌనస్వామి సమాధినీ, శివలింగాన్నీ దర్శించుకోవచ్చు.

వందే గురు పరంపరాభ్యామ్‌!
ఆది శంకరాచార్యుల వారి శృంగేరీ మఠ సంప్రదాయాన్ని అనుసరించి మౌనస్వామి స్థాపించిన పీఠం ఇది. ఆయనే దీనికి విమలానంద భారతీస్వామిని మొదటి పీఠాధిపతిగా నియమించారు. ఆ మొదటి పీఠాధిపతి తరువాత కాలక్రమంలో ఇప్పటికి మరో ముగ్గురు పీఠాధిపతులు అయ్యారు. ప్రస్తుతం శ్రీసిద్ధేశ్వరానంద భారతీస్వామి (పూర్వాశ్రమంలో గుంటూరు హిందూ కళాశాల ప్రధాన ఆచార్యులైన, కవి – పండితులు డాక్టర్‌ ప్రసాదరాయ కులపతి) పీఠాధిపతి. ప్రకాశం జిల్లా ఏల్చూరులో జన్మించిన ఆయనది కవి నుంచి ఋషిగా, ఋషి నుంచి యతిగా, యతి నుంచి పీఠాధిపతిగా ఎదిగిన విశిష్ట చరిత్ర. వేల పద్యాల్ని ఆశువుగా చెప్పి, అవధానాలు చేసి, 100 పుస్తకాలు రాసిన ఆయన హిమాలయాల సహా పలుచోట్ల తపస్సు చేశారు.🌹 స్వామీ సేవలో మీ సహస్ర సాయి

ఆధ్యాత్మిక, ధార్మిక వికాసాలను, ధర్మ జాగృతిని కలిగిస్తూ నమ్ముకున్న భక్తుల కష్టాలను, ఈతిబాధలను, సమస్యలను నిర్మూలించి పవిత్రులను చేసే దివ్య, భవ్యమైన నేలలో శ్రీ వౌనస్వామి ప్రతిష్ఠించిన శ్రీ కుర్తాళం పీఠం ఆధ్యాత్మిక సేవలో తన పేరిట వందేళ్ల చరిత్ర లిఖించుకుంది. ప్రపంచం నలుదిశలా తన వెలుగుల ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. అచ్యుతుని బాపనయ్య - సీతమ్మ దంపతులకు 1868లో జన్మించారు వౌనస్వామి. అసలు పేరు పిచ్చియ్య కాగా అచ్యుతుని లక్ష్మీనరసయ్య - సుందరమ్మ దంపతులకు దత్తత వెళ్లగా మార్చిన పేరు శివయ్య. భార్య పేరు కామేశ్వరమ్మ. ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. 1906లో సంసార త్యాగంతో ఉత్తర దేశ గమనం సాగిస్తుండగా శ్రీ అచ్యుతానంద సరస్వతీ స్వామి సన్యాస దీక్షనందించి శివచిదానంద సరస్వతిగా సన్యాస నామకరణం చేశారు. శ్రీ శివచిదానంద సరస్వతి స్వామి హిమాలయాల్లో తపస్సు చేసి అనన్యమైన, అసామాన్యమైన సిద్ధ శక్తులు సాధించి మహా మహిమాన్వితులుగా, సిద్ధ పురుషులుగా, ఆంధ్ర యోగిశేఖరులుగా, పరమహంస పరివ్రాజకాచార్యులుగా లోకకల్యాణం కోసం తమిళనాడు రాష్ట్రం కుర్తాళంలో శ్రీ సిద్ధేశ్వరీదేవిని వారి గురువు శ్రీ అచ్యుతానంద సరస్వతి స్వామి ఆజ్ఞానుసారం ప్రతిష్ఠించి మహత్తరమైన సిద్ధ పీఠాన్ని స్థాపించారు. హిమాలయాల్లో 25వేల సంవత్సరాల క్రితం అవతరించిన ఆ దేవత గురుకృప వల్ల స్వామితో కదలివచ్చి ఆశ్రీత కల్పవల్లిగా భాసిల్లుతోంది. వేదవ్రతాన్ని ధరించి వౌనస్వామిగా ప్రసిద్ధులైన శ్రీ శివచిదానంద సరస్వతి స్వామి వందేళ్ల క్రితం ఈ ప్రతిష్ఠను దేవీ నవరాత్రుల్లోనే చేశారు.
జన్మాంతర సంస్కారంతో మహనీయులు, భక్తులు ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లి దర్శిస్తుండేవారు. కుటుంబ పోషణ చేస్తూ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్న రాజమండ్రిలో ఆ సమయంలోనే నిరాడంబర, వ్యామోహ రహిత, ఒక బైరాగి జీవితం శివయ్యను ఆకర్షించింది. కరతల భిక్ష, తరుతల శయ్యలతో ఆ బైరాగిని చూసిన నాటి నుంచి స్వామి మనస్సు రోజురోజుకూ వైరాగ్యం వైపు పరుగులిడింది. ప్రతి వ్యక్తి బ్రహ్మస్వరూపుడేనని, మాయ ఆవరించటంతో తనని తాను తెలుసుకోలేకుండా ఉన్నాడని, దేహంలోని జ్ఞానసంపదను నరుని నుంచి దొంగిలించటానికి అరిషడ్వర్గాలనే దొంగలు పొంచి ఉన్నారని యోగి హెచ్చరించినట్లు సంసార బంధాల నుండి బయటపడటానికి స్వామి మానసికంగా సన్యాస స్థితికి వచ్చారు. ‘అన్నిటికీ సాక్షినైన నేను శివుడ’ను అనే భావం రోజురోజుకూ తీవ్రమై ఒకరోజు గృహ పరిత్యాగం చేసి నిజమైన శివత్వాన్ని దర్శించటానికి హిమాలయాలకు వెళ్లి తపం ఆచరించాలని నిశ్చయించుకున్నారు స్వామి.
అలా మొదలైన ప్రయాణం నైమిశారణ్యానికి వెళ్లటం, వ్యాసుని గద్దెను దర్శించటం, సూత మహాముని ప్రవచనం చేసిన ప్రదేశం, శౌనకాది ఋషులు నివసించిన ఆశ్రమాలు దర్శించటం జరిగింది. ఆ ఆడవిలో పయనిస్తుండగా కొన్ని వందల సంవత్సరాల నుంచి కొండ గుహలో జీవిస్తున్న విచిత్రాకృతిలోని ఓ వృద్ధయోగి స్వామికి కనిపించారు. స్వామి ఆయనను సేవించారు. ఆకలి, అలసట అనిపించినా కనిపించనీయక పోవటం, ఎండ వానలను లెక్కచేయక పోవటంతో ఆ వృద్ధయోగికి స్వామిపై కరుణ కలిగింది. వందల సంవత్సరాలైనా ఆ వృద్ధయోగి శక్తికి కారణమైన వ్యాసుని శిష్యుడు సుమంతుని పరంపరలో ఒక యోగి వల్ల లభించిన అధర్వత మంత్రాన్ని వృద్ధయోగి స్వామికి ఉపదేశించారు. అక్కడి నుండి అలా బయలుదేరి హిమాలయాలకు చేరుకున్నారు స్వామి. అక్కడ స్వామికి ఒక ఆశ్రమం కనిపించింది. దశమహా విద్యలకు మూలదేవత అయిన సిద్ధేశ్వరీదేవిని పరశురాముని అనుగ్రహంతో సాక్షాత్కరింప చేసుకున్న ఇరవై ఐదు వేల సంవత్సరాల తన పూర్వజన్మల పరంపర తెలిసిన దత్తాత్రేయ సంప్రదాయానికి చెందిన స్వామి అచ్యుతానంద సరస్వతి ఆ ఆశ్రమానికి అధిపతి. త్రికాలజ్ఞుడైన ఆయన స్వామిని అనుగ్రహించి సన్యాస దీక్షనిచ్చారు. వౌనస్వామి కైలాస శిఖర ప్రాంతంలో సాధన చేస్తున్న సమయంలో స్వామి అక్కడ ఒక గుహలో నివసించినట్లు స్ఫురించటం, చిత్రమైన అనుభవాలు కలగటం, సిద్ధశక్తుల వికాసం ప్రారంభం కావటం జరిగింది. అక్కడే ఉండి మరింత సాధన చేస్తానని సన్యాస దీక్ష అందించిన గురువుతో స్వామి అనగా ‘ఇక్కడ కైలాసపర్వత గుహల్లో తపస్సు చేస్తూ సిద్ధుడవైన నిన్ను ఇప్పుడు మరొక దేహంలో జన్మింపజేసింది. ఈ సిద్ధాశ్రమంలో శిక్షణ పొందిన యోగులు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి ఆధ్యాత్మిక చైతన్యం కలిగించసాగారు. ఇదంతా సిద్ధుల సంకల్పం వల్ల సాగుతున్న ప్రణాళిక. మానవులు అల్పాయుష్కులు, అరిషడ్వర్గ పీడితులు. కాబట్టి వీరికి ఆధ్యాత్మిక కవచం అవసరం’ అని స్వామితో వారి గురువు అన్నారు. గురువు అచ్యుతానంద సరస్వతి స్వామి ఆజ్ఞానుసారం విశుద్ధానందతో కలిసి దక్షిణాపథానికి బయలుదేరారు స్వామి. అలా పయనమై కాశీ, కాశ్మీరు, అమరనాథ్, బదరీనాథ్, కేదారనాథ్, తరువాత మహారాష్టల్రో అచ్యుతానంద స్వామి శిష్యుడు అనరుద్ధానంద, వారి శిష్యులు నారాయణానంద, వారి శిష్యుడు మంత్రవేత్త, దత్తస్వామి నిత్యానుగ్రహపాత్రుడు శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామిని గురు ఆజ్ఞ మేరకు కలిశారు వౌనస్వామి.
ఆ టెంబేస్వామి ఆశ్రమంలో వుండిన కొన్నాళ్ల తరువాత వౌనస్వామి షిర్డీలోని సాయిబాబా అనే యోగి దగ్గరకు వెళ్లారు.

అక్కడ వారిద్దరూ ఆత్మీయులైనారని, యోగ విద్యలను ఇచ్చిపుచ్చుకున్నారని, ముఖ్యంగా ఖండయోగ విద్య షిరిడీ సాయిబాబాకు నేర్పింది ఈ వౌనస్వామియేనని కొందరు యోగులు చెపుతుంటారు. అప్పటివరకు పలుచోట్ల మాట్లాడుతూ వస్తున్న స్వామి ధ్యానంలో వుండగా గురువు దర్శనమిచ్చి.. శాస్తవ్రాదాలు, పండిత చర్చల పని నీది కాదని, కాశ్మీరులో జరిగిన వాదాలు, చర్చలలో పాల్గొన్న స్వామితో అన్నారు. దీంతో స్వామి ఆనాటి నుంచి పూర్తిగా మాట్లాడటం మానేస్తానని, వౌనిగా మానవ సేవ చేస్తానని గురువుతో చెప్పి ‘వౌనస్వామి’గా మారారు. దక్షిణాదిన పంచవటిలోని ఒక గుహలో తపస్సు, కర్ణాటకలోని కొల్లూరు (కోలాపురి) మూకాంబికను ప్రత్యక్షంగా దర్శించటం, అరుణాచలం రమణ మహర్షి తపస్సు చేసిన గుహ సమీపాన పాతాళలింగ గుహలో తపస్సు తరువాత త్రికూటాచలం చేరుకున్నారు. శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతి మహాస్వామిని దర్శించారు. కుర్తాళం సిద్ధ క్షేత్రమని, తపస్సుకు అనుకూల ప్రదేశమని, సన్యాసులకు సరైన వసతి లేదు కనుక మఠాన్ని నిర్మించమని మహాస్వామి సూచించగా వౌనస్వామి అంగీకరించి ఆశ్రమ నిర్మాణం, దండాయుధపాణి, శంకరాచార్య ప్రతిష్ఠలు 1910లో చేశారు. వరుసగా దత్తాత్రేయ, వినాయక ప్రతిష్ఠలు, రాజరాజేశ్వరి, కామేశ్వర ప్రతిష్ఠలు, 1933లో షణ్ముఖ, అయ్యప్ప ప్రతిష్ఠలు, 1936లో సిద్ధేశ్వరీ పీఠ స్థాపన, 1919లో సీతారామాదుల ప్రతిష్ఠలు, 1938లో నాడీ గణపతి ప్రతిష్ఠలను వౌనస్వామి జరిపించారు. వౌనస్వామి 1943 డిసెంబర్ 28న మధ్యాహ్నం 3 గంటలకు సిద్ధిపొందారు. 1951లో స్వామి సమాధిపై నీలకంఠేశ్వర లింగ ప్రతిష్ఠ జరిగింది. కాశీ నుంచి తీసుకొచ్చిన శివలింగాన్ని నీలకంఠేశ్వర నామంతో అప్పుడు పీఠాధిపతి త్రివిక్రమ రామానంద భారతీస్వామి ప్రతిష్ఠించారు. వౌనస్వామి (శ్రీ శివచిదానంద సరస్వతి స్వామి) వ్యవస్థాపకులైన కుర్తాళం పీఠానికి శ్రీ విమలానంద భారతీస్వామి, శ్రీ త్రివిక్రమ రామానంద భారతీస్వామి, శ్రీ శివచిదానంద భారతీస్వామి, ఆ వరుస క్రమంలో నాలుగో పీఠాధిపతిగా పరమహంస పరివ్రాజకాచార్య జగద్గురు శ్రీ సిద్ధేశ్వరానంద భారతీస్వామి ధర్మ జాగృతి యాత్రను దేశ, విదేశాల్లో చేస్తూ నమ్ముకున్న వారి వెన్నంటే వుండి వారిని అన్నివేళలా ఆదుకుంటూ లోకకల్యాణం కోసం అన్నివేళలా జాగరూకతతో ఉంటున్నారు. భారత జాతి వైభవం కోసం, ఆర్ష సంస్కృతి పునరుద్ధరణ కోసం నిరంతరం పాటుపడుతున్న దైవస్వరూపులు, మంత్రసిద్ధులు, లక్షలాది మంది సమస్యలు పరిష్కరించి ఆధ్యాత్మిక మార్గంలో దివ్యానుభూతులు ప్రసాదిస్తున్న యోగీశ్వరులు శ్రీ సిద్ధేశ్వరానంద భారతీస్వామి ఈ సిద్ధేశ్వరీ పీఠ శతాబ్ది ఉత్సవాలను దేవతా యజ్ఞాలు, సంగీత, సాహిత్య, నాట్యాది కార్యక్రమాలతో వైభవంగా నిర్వహిస్తున్నారు.
పూర్వాశ్రమంలో ప్రసాదరాయ కులపతిగా స్వామి గుంటూరు హిందూ కళాశాల ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు నిర్వహించారు. లలితాదేవి చరిత్ర, బృందావన భాగవతం, వ్రజ భాగవతం, బృందావన యోగులు, కాళీ సిద్ధులు, సిద్ధాశ్రమ యోగులు, కుర్తాళ యోగులు, భైరవ సాధన, నాగసాధన, ప్రత్యంగిరా సాధన, రసవాహిని, రసగంగ, కవిబ్రహ్మ.. వంటి రచనలు చేశారు. 2002లో పీఠాధిపత్యం స్వీకరించారు. తమిళనాడు కుర్తాళ సిద్ధేశ్వరి పీఠం, గుంటూరు స్వయంసిద్ధ కాళీ పీఠం, శ్రీనాథ పీఠం, విజయవాడ త్రిపురసుందరీ పీఠం, నెల్లూరు దత్తాత్రేయ మఠం, విశాఖపట్టణం లలితా పీఠం, హైదరాబాద్ ప్రత్యంగిరా పీఠాలను దర్శిస్తూ నిత్యం స్వామి భగవత్ చింతనలో గడుపుతుంటారు. వేల మందికి మంత్రోపదేశం చేసి ఆధ్యాత్మిక చైతన్యం, కష్టనివారణ, అభీష్ట ప్రాప్తి కలిగించి అనుగ్రహించిన మహిమాన్వితులు. హిందూ ధర్మ రక్షణ యజ్ఞాలు చేసిన, చేయిస్తున్న దివ్య శక్తిసంపన్నులు. 

Comments